Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదని చెల్లితో గొడవ.. తండ్రి మందలించాడని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:59 IST)
స్మార్ట్‌ఫోన్లు మంచి ఎంతవరకో కానీ.. నేరాల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లను అందరూ తెగ వాడేస్తున్నారు. ఇంకా చిన్నారులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లను అతిగా వాడేవారిలో యవత్ ముందున్నారు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేందుకు చిన్నారులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్ కోసం అక్కాచెల్లి గొడవ పడ్డారు. 
 
ఈ గొడవలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఈ పట్టణానికి చెందిన కంభం దామోదర్ రెడ్డి.. ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుచిత డిగ్రీ తొలి సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి సెల్‌ఫోన్ విషయంలో చెల్లెలు హాసినితో సుచితకు వివాదం తలెత్తింది.
 
గమనించిన తండ్రి దామోదర్ రెడ్డి.. పెద్ద కుమార్తెను మందలించాడు. పరీక్షలు దగ్గరపడుతుండగా ఫోన్ కోసం జగడం ఎందుకని హితవు పలికాడు. దీంతో పెద్ద కుమార్తె సుచిత ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోసం ఎంత వెతికినా.. లాభం లేకపోయింది. కాగా.. ఆదివారం ఉదయం రైలు పట్టాలపై సుచిత శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments