Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి భవనాన్ని కూడా వదల్లేదు.. వైకాపా రంగులు వేసేశారు..

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (07:59 IST)
ఏపీలోని అధికార పార్టీ నేతలకు రంగుల పిచ్చిపట్టింది. అందుకే ప్రభుత్వ భవనాలను ఇష్టానుసారంగా తమ పార్టీ జెండాలోని మూడు రంగులు వేస్తున్నారు. ఈ రంగులు వేయొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మొత్తుకున్నప్పటికీ వైకాపా నాయకులు మాత్రం పెడచెవిన పెట్టేస్తున్నారు. తాజాగా బాపట్లలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలకు వైకాపా రంగులు వేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ప్రాంతీయ ఆసుపత్రిని రూ.3.50 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ పతాకాల రంగులు వేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఆసుపత్రి భవనాలకు అధికార పార్టీ పతాకం స్ఫురించేలా రంగులు వేయించటంపై రోగులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థను ప్రశ్నించగా.. ఆసుపత్రిలో పనులు ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. సంస్థ ఉన్నతాధికారులు నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాంతీయ వైద్యశాల భవనాలకు గుత్తేదారుతో రంగులు వేయించినట్లు ఇంజినీర్లు తెలిపారన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments