Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి: సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:33 IST)
సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాల్లో ఉండే సిపిఐ నారాయణ ఈసారి తెలంగాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్థం ఎందుకని ప్రశ్నించారు.
 
నీటి యుద్ధం జరిగేలా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి నాలుకను కోయాలన్నారు సిపిఐ నారాయణ. ప్రశాంత్ రెడ్డి ఒక్కరే కాదు ఎవరు ఈ మాట అన్నా సరే వారి నాలుక కోయాలన్నారు. ప్రస్తుతం నీటి యుద్ధం అవసరమా అని..కరోనా కష్టకాలంలో కూలంకుషంగా ఒకరినొకరు చర్చించుకోవాలే తప్ప ఈ మాటల యుద్ధం ఎందుకంటా మండిపడ్డారు. 
 
ప్రధానమంత్రి నరేంద్రమోడీపైన నిప్పులు చెరిగారు నారాయణ. ప్రపంచంలోనే మోడీ లాంటి అసమర్థ ప్రధాని లేడు అంటూ మండిపడ్డారు. దేశంలో రాజకీయ మార్పు రాబోతోందని జోస్యం చెప్పారు. థర్డ్ ఫ్రంట్ బలపడుతోందని..థర్డ్ ఫ్రం్ ను శరద్ పవార్ నడిపిస్తారని చెప్పారు.
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని..కార్పొరేట్ సంస్ధలతో మోడీ లాలూచీ పడ్డారన్నారు. పెట్రోల్, డీజల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ఆర్.ఎస్.ఎస్.ను మించిన టెర్రరిస్టులు లేరంటూ విమర్సించారు. బిజెపిని ఎవరు ప్రశ్నించినా దేశద్రోహం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments