Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో త్రిభాషా చిత్రం

Advertiesment
Shekhar Kammula
, శుక్రవారం, 18 జూన్ 2021 (10:26 IST)
Dhanush-Sekar kammulla
ఈరోజు ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మేతందిరం సినిమా విడుద‌ల కాబోతుంది. అదేవిధంగా తెలంగాణ పంపిణీదారుడు, నిర్మాత నారాయణదాస్ నారంగ్ పుట్టిన‌రోజు ఈరోజే. అందుకే ధ‌నుష్‌తో కొత్త సినిమాను ప్ర‌క‌టించారు.
 
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్డై రెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం   ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
 
ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల తన తాజా ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు తమిళం హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ములతో రీసెంట్ గా ఈ నిర్మాతలు లవ్ స్టోరి సినిమానునిర్మించారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్డీ టెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్‌ను మహారాష్ట్ర సర్కారు టార్గెట్ చేసిందా?