Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : సీపీఐ నారాయణ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేదని, రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయంటూ హైదరాబాద్ వేదికగా జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీలో మాత్రం రోడ్డు గుంతలమయంగా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్డు చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. 
 
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామమైన అయనంబాక్కం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments