Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు పాలిష్ చేసిన నారాయణ, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:58 IST)
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి షూని పాలిష్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

 
సామాన్యుడు చెప్పులు కాలికి కాకుండా నెత్తిపై పెట్టుకుని వెళ్ళే దుస్థితికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సామాన్యుడు బట్టలు కూడా వేసుకునే పరిస్థితి ఇక లేదన్నారు. జిఎస్టీలతో సామాన్యుడిని ఎన్నో ఇబ్బందులు కేంద్రప్రభుత్వం చేస్తోందన్నారు. 

 
ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి వట్టి చేత్తో సిఎం తిరిగి రాకూడదన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలపై పిఎంను అడగాలన్నారు. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రశ్నించాలన్నారు. చెప్పులపై జిఎస్టీ వేయడం దారుణమన్నారు.

 
కార్పొరేషన్ కంపెనీలకు కొమ్ము కాయడం, నిరుపేదలను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై స్పందించాలన్నారు. కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.

 
గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. రామకుప్పంలో ఎస్సి, ఎస్టిలపై రెడ్డి సామాజిక వర్గం దాడులకు దిగడాన్ని ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments