Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిపిఐ నారాయ‌ణ కాలికి... ఎంపీ గురుమూర్తి మ‌సాజ్

సిపిఐ నారాయ‌ణ కాలికి... ఎంపీ గురుమూర్తి మ‌సాజ్
విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (12:19 IST)
పెద్ద‌లు క‌నిపిస్తే, కాళ్ళ‌కు న‌మ‌స్కారం చేస్తారు. కానీ ఇలా ప్ర‌తిప‌క్ష నేత కాళ్ళు ప‌ట్టుకున్నారేంటని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అదీ సీపీఐ నేత కాళ్ళు, అధికార వైసీపీ నేత ప‌ట్టుకోవ‌డం ఏంట‌ని అపార్ధం చేసుకుంటున్నారా? అదేం లేదండి... ఇది చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న‌అరుదైన సన్నివేశం. 

 
తిరుపతి రూరల్ మండలం రాయలచెరువు పరిశీలనకు వచ్చిన సిపిఐ నారాయణ కాలికి గాయమైంది. దీంతో అక్కడ వైసీపీ నేతలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయ‌న‌కు ఏదైనా ప్రాథ‌మి చికిత్స చేయాల్సి వ‌చ్చింది. ఫిజియోథెరపిస్ట్ కూడా అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి నారాయణ కాలికి ప్రథమ చికిత్స చేశారు. నారాయణ కాలును తన తొడ పై పెట్టుకుని మ‌రీ కట్టు కట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ వైసిపి నేతలైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇతర నేతలతో సరదాగా ముచ్చటించారు. ఎప్పుడూ వైసిపి నేతలపై అంత ఎత్తున లేచిపడే సీపీఐ నారాయణ వారితో జోకులు వేస్తూ, సరదాగా గడపడం అంద‌రికీ ఆసక్తిని క‌లిగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానేరు డ్యాంలో యువతి మృతదేహం.. ఏం జరిగింది..?