Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభాపతి అందుకు పనికిరాడు, వంశీ ఆలస్యంగానైనా మేల్కొన్నాడు: నారాయణ

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (21:28 IST)
ఎపి శాసన సభాపతిగా తమ్మినేని సీతారాం పనికిరాడంటూ విమర్సించారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సభాపతి మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు చూడనేలేదంటూ మండిపడ్డారు సిపిఐ నారాయణ.

 
తిరుపతిలో మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఆలస్యంగానైనా వల్లభనేని వంశీ భువనేశ్వరికి క్షమాపణ చెప్పడం శుభపరిణామమన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను విమర్సించవద్దన్నారు. దేశంలో 750మంది రైతులు ఆత్మహత్యలన్నీ.. కేంద్రప్రభుత్వ హత్యలేనన్నారు సిపిఐ నారాయణ.

 
సస్పెండ్ చేసిన 13 మంది ఎంపిలను తిరిగి పార్లమెంటులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో వైసిపి ఎంపిలు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బిజెపితో వైసిపి లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు.

 
పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వైసిపి ఎంపిలు భయపడిపోతున్నారని విమర్సించారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని విమర్సించడం.. ఢిల్లీ వెళ్ళిందే మౌనంగా కూర్చుండిపోవడం వైసిపి నాయకులు తెలిసిన జిమ్మిక్కులంటూ మండిపడ్డారు. అమరావతి రైతులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయణ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments