Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, చెన్నై అపోలో ఆసుపత్రికి భూమన కరుణాకర్ రెడ్డి

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (12:09 IST)
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శించారు. వయసురీత్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
జగన్ సలహా మేరకు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ఆసుపత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ వున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే భూమన కరుణాకర్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం తిరుపతిలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన మృతదేహాలను స్వయంగా శ్మశానంలో పూడ్చిపెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇపుడు మరోమారు ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments