Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో కార్తీక దీపాలు వ‌ద‌ల‌బోయి... ప్రాణాలు వ‌దిలిన దంప‌తులు

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (10:18 IST)
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కాల్వలో దీపాలు వదిలేందుకు వెళ్లిన దంపతులు త‌మ నిండు ప్రాణాల‌ను వ‌దిలారు. కాలువ‌లో దీపాలు వ‌దులుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి అందులో పడి మృతి చెందారు. కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్ (44), ఇందిర (41) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాఘవేంద్రప్రసాద్ దంపతులు తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.
 
 
పూజల అనంతరం కాల్వలో దీపం వదులుతూ, ప్రమాదవశాత్తు ఇందిర అందులో పడిపోయారు. ఆమెను రక్షించే క్రమంలో భర్త రాఘవేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జహారాపురం వద్ద వారి మృత దేహాలను గుర్తించారు. కార్తీక మాసంలో జ‌రిగిన ఈ దంప‌తుల విషాదాంతం అంద‌రినీ క‌లిచివేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments