Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:22 IST)
విశాఖ మన్యంలోని జికె.వీధి మండల పరిధి అమ్మవారి దారకొండ, పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

గ్రేహౌండ్స్‌ దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు బృందాలూ కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు.

ఎదురుకాల్పులను ఎఎస్‌పి తుషార్‌ డూడి ధ్రువీకరించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. తాజా కాల్పులతో మన్యంలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments