Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిష్య పండితులారా తప్పును సరిదిద్దుకోండి: 12 రాశుల్లో తిరిగేది భూమి.. సూర్యుడు కాదు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:41 IST)
పంచాంగంలో  సూచించినట్లు 12 రాశుల్లో తిరిగేది భూమి అని, సూర్యుడు కాదని ప్రముఖ జ్యోతిష్య విద్యా రత్న నందిపాటి మధుసూదన రావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఐలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అందరూ చెబుతున్న రాశి చక్రంలో రవి 12 రాశుల్లో తిరుగుతున్నట్లు చూపిస్తున్నారని, అది శుద్ద తప్పని 12 రాశుల్లో తిరిగేది భూమి అని అన్నారు. ఇలా బోధించడం వలన భావి తరాల విద్యార్థులు ఎటువంటి గందరగోళం లేకుండా విషయాన్ని గ్రహిస్తారని అన్నారు.

భూమి స్థానంలో రవి తిరుగుతున్నాడని గత కొద్ది శతాబ్దాలుగా ఈ తప్పును కొనసాగిస్తున్నారని అని అన్నారు. అది ఎక్కడో జరిగిన తప్పును కొనసాగించడం మంచి కాదని ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

దానికి సంబంధించిన గ్రంథాలు ప్రాచీన నలంద విశ్వ విద్యాలయంలో ఉండవచ్చని అవి విదేశీ దండయాత్రల్లో కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాటి తాలుకా నకళ్ళు ఏవరి వద్దనైనా  ఉంటే అందచేయవలసిందిగా కోరారు. అందుకు తగిన పారితోషికం ఇస్తానని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు కూడా మన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగానే సండే, మండే, ట్యూస్ డే, వెన్స్ డే అని వారాల పేర్లు పొందుపరిచారని అన్నారు. ఏమైనా సందేహలు ఉంటే 7386678714 సెల్ నంబర్ కు సంప్రదించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments