Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిష్య పండితులారా తప్పును సరిదిద్దుకోండి: 12 రాశుల్లో తిరిగేది భూమి.. సూర్యుడు కాదు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:41 IST)
పంచాంగంలో  సూచించినట్లు 12 రాశుల్లో తిరిగేది భూమి అని, సూర్యుడు కాదని ప్రముఖ జ్యోతిష్య విద్యా రత్న నందిపాటి మధుసూదన రావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఐలాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అందరూ చెబుతున్న రాశి చక్రంలో రవి 12 రాశుల్లో తిరుగుతున్నట్లు చూపిస్తున్నారని, అది శుద్ద తప్పని 12 రాశుల్లో తిరిగేది భూమి అని అన్నారు. ఇలా బోధించడం వలన భావి తరాల విద్యార్థులు ఎటువంటి గందరగోళం లేకుండా విషయాన్ని గ్రహిస్తారని అన్నారు.

భూమి స్థానంలో రవి తిరుగుతున్నాడని గత కొద్ది శతాబ్దాలుగా ఈ తప్పును కొనసాగిస్తున్నారని అని అన్నారు. అది ఎక్కడో జరిగిన తప్పును కొనసాగించడం మంచి కాదని ఆ తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

దానికి సంబంధించిన గ్రంథాలు ప్రాచీన నలంద విశ్వ విద్యాలయంలో ఉండవచ్చని అవి విదేశీ దండయాత్రల్లో కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాటి తాలుకా నకళ్ళు ఏవరి వద్దనైనా  ఉంటే అందచేయవలసిందిగా కోరారు. అందుకు తగిన పారితోషికం ఇస్తానని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు కూడా మన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగానే సండే, మండే, ట్యూస్ డే, వెన్స్ డే అని వారాల పేర్లు పొందుపరిచారని అన్నారు. ఏమైనా సందేహలు ఉంటే 7386678714 సెల్ నంబర్ కు సంప్రదించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments