Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక పెళ్ళి తెచ్చిన తంటా 40 మందికి కరోనా... మళ్ళీ ప్రారంభమైందా?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:44 IST)
విశాఖ జిల్లాలో ముప్పుతెచ్చిపెట్టిన శుభకార్యాలు. రాంబిల్లి మండలం రాజుకోడూరులో 40 మందికి కరోనా సోకింది. కర్ఫ్యూ మినహాయింపుల తరువాత అత్యధిక కేసులు నమోదైన గ్రామంగా నిలిచింది.
 
విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ భావించారు. దీంతో సామాజిక దూరాన్ని, మాస్కులను గాలికొదిలేశారు. ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళేవారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు శుభకార్యాల్లో మాస్కులు ధరించడం మానేశారు.
 
థర్డ్ వేవ్ ఎప్పుడో వస్తుందని ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని విశాఖ జనం నిర్ణయం తీసేసుకున్నారు. ఇలా చేయడంతో కరోనా మహమ్మారి ఒక వివాహంలో విజృంభించింది. 
 
రాబిల్లి మండలం రాజుకోడూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన 40 మందికి కరోనా సోకింది. వివాహానికి హాజరైన వారిలో ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండడం.. అతనికి తెలియకుండా వివాహానికి హాజరవ్వడంతో అక్కడకు వచ్చిన మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకింది. 
 
వివాహానికి హాజరైన మరుసటి రోజు నుంచే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో కొంతమంది వెళ్ళి ఆర్టీపీసీఆర్ ద్వారా చెకప్ చేసుకున్నారు. దీంతో పాజిటివ్ అని తేలడం వారు వివాహానికి హాజరైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వివాహానికి హాజరైన అందరికీ పరీక్షలు చేసి 40 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments