Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక పెళ్ళి తెచ్చిన తంటా 40 మందికి కరోనా... మళ్ళీ ప్రారంభమైందా?

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:44 IST)
విశాఖ జిల్లాలో ముప్పుతెచ్చిపెట్టిన శుభకార్యాలు. రాంబిల్లి మండలం రాజుకోడూరులో 40 మందికి కరోనా సోకింది. కర్ఫ్యూ మినహాయింపుల తరువాత అత్యధిక కేసులు నమోదైన గ్రామంగా నిలిచింది.
 
విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ భావించారు. దీంతో సామాజిక దూరాన్ని, మాస్కులను గాలికొదిలేశారు. ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళేవారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు శుభకార్యాల్లో మాస్కులు ధరించడం మానేశారు.
 
థర్డ్ వేవ్ ఎప్పుడో వస్తుందని ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని విశాఖ జనం నిర్ణయం తీసేసుకున్నారు. ఇలా చేయడంతో కరోనా మహమ్మారి ఒక వివాహంలో విజృంభించింది. 
 
రాబిల్లి మండలం రాజుకోడూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన 40 మందికి కరోనా సోకింది. వివాహానికి హాజరైన వారిలో ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండడం.. అతనికి తెలియకుండా వివాహానికి హాజరవ్వడంతో అక్కడకు వచ్చిన మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకింది. 
 
వివాహానికి హాజరైన మరుసటి రోజు నుంచే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో కొంతమంది వెళ్ళి ఆర్టీపీసీఆర్ ద్వారా చెకప్ చేసుకున్నారు. దీంతో పాజిటివ్ అని తేలడం వారు వివాహానికి హాజరైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వివాహానికి హాజరైన అందరికీ పరీక్షలు చేసి 40 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments