కరోనా వైరస్.. ఆంధ్రాకు వెళ్ళొద్దు.. కేసీఆర్ వార్నింగ్

Webdunia
శనివారం, 2 మే 2020 (13:15 IST)
కరోనాను అదుపులో వుంచేందుకు తెలంగాణ సర్కారు చర్యలను వేగవంతం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇటీవల ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన వలస కూలీలను సరిహద్దు ప్రజలు అడ్డుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు తెలంగాణ ప్రజలు వెళ్లొద్దని ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది.
 
కాగా.. ఏపీలోని కర్నూలు, గుంటూరులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్నూలులో 400కు పైగా, గుంటూరులో 300కు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments