Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సమయంలో కరుణించిన వేంకటేశ్వరుడు, స్వామి నిధులతో కోవిడ్ షెడ్లు

Webdunia
గురువారం, 13 మే 2021 (18:55 IST)
కరోనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్ షెడ్లు నిర్మించడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ 3.52 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు ఈఓ జవహర్ రెడ్డి.
 
కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్ల అందుబాటు ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. ఈ ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గించడానికి ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్ నిర్మించి అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ షెడ్లు నిర్మించాలని టీటీడీకి విన్నపాలు వచ్చాయి. ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మేరకు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయోనిధి నుంచి రూ.3. 52 కోట్లు మంజూరు చేశారు.
 
ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశం 2, అనంతపురం 3, కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు 3, కాకినాడ 3తో పాటు ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నారు. టీటీడీ ఆమోదించిన అంచనా ఖర్చు మేరకు షెడ్లు నిర్మించుకోవడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు నిధులు అందించనుంది. ఒక షెడ్లో దాదాపు 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంతగానో కోవిడ్ రోగులకు ఉపయోగపడనుందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments