Webdunia - Bharat's app for daily news and videos

Install App

748మంది టిటిడి ఉద్యోగులకు కరోనా... ఐదుగురు మృతి

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (07:54 IST)
టిటిడిలో ఇప్పటి‌ దాకా 748 మంది కరోనా బారినపడినట్లు, ఐదుగురు మరణించినట్లు ఈవో‌ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత…ఇప్పటి దాకా 748 మందికి ఉద్యోగులు, అర్చకులు, భద్రతా సిబ్బంది కరోనా సోకినట్లు చెప్పారు. ఇందులో తిరుమలలో‌ 361, తిరుపతిలో 387 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే 305 మంది కోలుకున్నారని, ఇంకా 338 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

ఇప్పటి దాకా అలిపిరిలో 2, 029 మంది ఉద్యోగులకు, తిరుమలలో 4,532 మంది ఉద్యోగులకు కనోనా పరీక్షలు నిర్వహించినట్లు ఈవో సింఘాల్ తెలిపారు.అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని‌ ఎస్వీబీసిలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై ఈవో‌ స్పందించారు.

అదే సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ఉన్నందువల్ల అయోధ్య కార్యక్రమం ప్రసారం చేయలేకపోయామని చెప్పారు. అయితే దీనిపై‌ కొందరు అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారని‌ అన్నారు.

దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఆ సమయంలో టిటిడి కార్యక్రమమే ప్రసారం చేసాం తప్ప…ఏ క్రైస్తవ మత కార్యక్రమమో ప్రసారం చేయలేదని జవాబిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments