Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు పసరు మందు : ఇటుకల వ్యాపారిపై బైండోవర్ కేసు

Webdunia
గురువారం, 27 మే 2021 (12:04 IST)
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఇటుకల వ్యాపారి కరోనా బాధితులు పసరు మందు పంపిణీ చేశారు. దీంతో ఆయనపై పోలీలుసు బైండోవర్ కేసును నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏడుచుట్లకోట గ్రామానికి చెందిన ఇటుకల వ్యాపారి గోవిందరాజులు అనే వ్యక్తి కరోనా రోగులకు గత నాలుగు రోజులుగా ఉచితంగా ఓ పసరు మందు పంపిణీ చేస్తున్నారు. 
 
ఈ మందును సుమారుగా 400 మందివరకు తీసుకున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో తహశీల్దార్‌ రవి ఆయన్ను పిలిపించి విచారించారు. తాను ఏడో తరగతి వరకే చదివానని, తమ కుటుంబానికి నాటుమందు ఇచ్చే నేపథ్యం ఉందని, ఆనందయ్య మందు గురించి తెలుసుకుని తానూ ఇస్తున్నట్లు గోవిందరాజులు వివరించారు. 
 
ఎలాంటి అర్హత లేకుండా నాటుమందు పంపిణీ చేస్తున్న ఆయనపై బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్‌ తెలిపారు. మందు పంపిణీ చేసినవారిలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులకు నివేదించినట్లు సీఐ ప్రసాదబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments