Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచారామ క్షేత్రంలో ధన్వంతరి, మహా మృత్యుంజయ హోమాలు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా మహమ్మారి ఏపీని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. గత రెండుమూడు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ రాష్ట్రాన్ని హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాల నుంచి రెండంకెల లెక్కల్లో వైరస్ కేసులు నమోదు కావడంతో అంతటా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. దుకాణాలు, మార్కెట్లు అన్ని మూసివేయించారు. ప్రజలు ఇళ్లనుండి కాలు బయటపెట్టకుండా 144 సెక్షన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం, సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో దాని నివారణ కోసం, లోక శాంతి కోసం ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో అర్చక బృందం ధన్వంతరి హోమం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. 
 
భక్తులెవర్నీ లోనికి అనుమతించకుండా అర్చకులు, పండితులు ఈ హోమాలు జరిపారు. స్వామివారికి అర్చకులు రోజువారీ కైంకర్యాలు, పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈఓ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments