Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవింద రాజ స్వామి ఆలయంలో కరోనా కలకలం.. ఉద్యోగికి కరోనా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (15:13 IST)
తిరుమలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ ఈవో వెల్లడించారు. దీంతో శుక్ర, శనివారాల్లో ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని చెప్పారు.
 
అలాగే శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత ఆదివారం నుండి యధావిధిగా ఆలయాన్ని తెరుస్తామన్నారు. ఆలయంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగికి వేరువేరు ఆరోగ్య సమస్యలు ఉండడంతో రెగ్యులర్ చెకప్‌కు వెళ్లారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
ఈ ఉద్యోగి సంచరించిన పాత హుజుర్ ఆఫీస్‌, పిహెచ్ స్టోర్‌ను కూడా రెండు రోజులు మూసివేసి శానిటైజ్ చేసిన తర్వాతే తెరుస్తారు. అదేవిధంగా, ఉద్యోగికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments