Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీ ఆస్పత్రిలో శవాల మాయం.. డెడ్ బాడీ మార్పు.. చెక్ చేసుకుని ఖననం..!

గాంధీ ఆస్పత్రిలో శవాల మాయం.. డెడ్ బాడీ మార్పు.. చెక్ చేసుకుని ఖననం..!
, శుక్రవారం, 12 జూన్ 2020 (10:06 IST)
గాంధీ ఆస్పత్రిలో శవాల అప్పగింతకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. గతంలో లాలాపేటకు చెందిన బహదూర్ అనే నేపాలీ దేశస్థుడు నడుస్తూ నడ స్తూనే కుప్పకూలి చనిపోయాడు. టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. అతడి శవం ఏమైందో కూడా ఇప్పటికీ తెలియదు. ఆ తర్వాత వనస్థలి పురానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయాడు. 
 
డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా, కనీసం సమాచారమూ ఇవ్వకుండా దహనం చేశారు. దీనిపై అతడి భార్య హైకోర్టును ఆశ్రయించగా ఎంత వివాదం రేగిందో తెలిసిందే. రెండు రోజుల క్రితం బేగంపేట గురుమూర్తి నగర్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోగా, వేరే శవాన్నివారి కుటుంబసభ్యులకు ఇచ్చారు. తీరా శ్మశానవాటికకు వెళ్లిన తర్వాత గానీ వేరే వ్యక్తి డెడ్ బాడీ అని గుర్తించలేకపోయారు అతడి భార్య, కొడుకు. ఆ శవాన్ని తిరిగి గాంధీకి తీసుకొచ్చి అసలు శవాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే నాలుగోసారి ఇప్పుడు మరో ఘటన జరిగింది.
 
ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన డెడ్ బాడీని మరో కుటుంబానికి అప్పగించి గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం చూపించారు. పహాడీషరిఫ్‌కు చెందిన మహబూబ్ అనే వ్యక్తి, నాంపల్లికి చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి బుధవారం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయారు. మహబూబ్ కుటుంబ సభ్యులకు రషీద్ బాడీని గాంధీ సిబ్బంది అప్పగించారు. అయితే, డెడ్ బాడీని చెక్ చేసుకొని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఖననం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కఠినంగా లాక్ డౌన్‌: ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం