Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా శ్రీకాంత్ రెడ్డి, అమరనాథరెడ్డి.. శ్రీవారి దగ్గర మీకు రూల్స్ వర్తించవా?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (17:08 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుని దర్సనం చేసుకుంటూ ఉంటారు. పేద, మధ్య, ధనిక, వృద్ధులు అనే తేడా లేకుండా స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు.
 
అయితే అధికారంలోఉన్నా, లేకున్నా సరే దేవుడంటే భయం, భక్తి ఉండాలి. కానీ అధికార వైసిపి పార్టీ నేతలకు అదంతా ఏమీ లేదంటూ మండిపడుతున్నారు ప్రతిపక్షపార్టీ నేతలు. ఇంతకీ ఇదంతా జరగడానికి అసలు కారణం ఆగమశాస్త్ర, టిటిడి నిబంధనలను వైసిపి నేతలు గాలికొదిలేయడమే.
 
తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి నిన్న తిరుమలకు వచ్చారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిలు. పాదయాత్రగా వారు తిరుమలకు చేరుకున్నారు. అయితే ఇప్పటికే టోకెన్లు ఉన్న వారిని మాత్రం తిరుమలకు అనుమతిస్తున్నారు.. మిగిలిన ఎవరినీ అనుమతించలేదు.
 
కానీ ఇద్దరూ వైసిపి నేతలు కావడంతో వారి వెంట 3 వేలమంది వైసిపి కార్యకర్తలు కూడా వచ్చారు. టిక్కెట్లు లేకుండానే వారు శ్రీవారిని దర్సించేసుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు. టోకెన్లు లేక భక్తులు రోడ్డుపై పడిగాపులు కాస్తుంటే వైసిపి నేతలకు మాత్రం రాజమార్గాన్ని వేస్తారా అంటూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments