సీఎం జగన్‌కి కె.ఎ పాల్ శాపాలు

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (16:47 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. క్రిస్మస్ వేడుకలు జగన్ జరుపుకోవచ్చు.. కానీ మేము చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. ఇలా చేస్తే సర్వనాశనం కావడం ఖాయమంటూ శాపాలు పెట్టారు కె.ఎ.పాల్.
 
వైజాగ్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కె.ఎ.పాల్. స్టిక్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేయడమే కాకుండా సభ కోసం స్థలాన్ని చూసుకుని అందులో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆంక్షలను క్రిస్మస్ వేడుకలపై విధించింది. రోడ్లపైన బహిరంగ సభలు పెట్టడం.. హడావిడి చేయడం లాంటివి చేయకూడదంటూ షరతులను విధించింది. అయితే కె.ఎ.పాల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా కార్యక్రమానికి సిద్థమయ్యారు.
 
దీంతో విశాఖ నగర పాలకసంస్థ అధికారులు నేరుగా పాల్ ఏర్పాటు చేస్తున్న సభాస్థలికి చేరుకుని హోర్డింగులు, బ్యానర్లను ఎత్తుకెళ్ళారు. కె.ఎ.పాల్ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసుల వైఖరితో మండిపడ్డ కె.ఎ.పాల్ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments