Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. చీటర్ అంటూ ఫైర్

ధోనీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. చీటర్ అంటూ ఫైర్
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:06 IST)
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంపైర్‌తో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాదనకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టామ్ కరన్‌ ఔట్ విషయంలో ధోనీకి కోపం వచ్చింది. వెంటనే అంపైర్‌ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అయితే ఈ విషయంలో చివరకు ధోనీ అప్పీల్ తప్పుగా తేలడంతో అతని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. చీటర్ అంటూ విరుచుకుపడుతున్నారు.
 
18వ ఓవర్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో టామ్ కరన్ ఆడే సమయంలో బ్యాట్‌కు తాకుతున్నట్టుగా వెళ్లి కీపర్ ధోని చేతిలో పడింది. వెంటనే అప్పీల్ చేయగా.. అంపైర్ సి. షంషుద్దీన్ ఔట్ ఇచ్చాడు. కానీ తన బ్యాట్‌కు బంతి తగలలేదని చెప్పండంతో థర్డ్ అంపైర్ రివ్యూ కోరారు. ఆలోపే ధోనీ సహనం కోల్పోయాడు. క్యాచ్ అందుకోకముందే బంతి నేలని తాకినట్లు తేలడంతో నాటౌట్‌గా పేర్కొన్నారు. 
 
కానీ ఔట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ ఎలా కోరుతారంటూ.. వాదనకు దిగాడు. తప్పు ఉందని తెలిసినా అంపైర్‌తో గొడవకు దిగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఐపీఎల్ 2019 సీజన్‌లోనూ ఇలానే నోబాల్ విషయంలోనూ ధోనీ ఇలానే అంపైర్లతో గొడ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోణీ కొట్టేదెవరో? ... నేడు కోల్‌కతా వర్సెస్ ముంబై