Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తా: పండుల రవీంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:58 IST)
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్. పండుల రవీంద్రబాబు అన్నారు. రాష్ట్ర శాసన మండలి ఆవరణలో శుక్రవారం శాసన పరిషత్తు అధ్యక్షులు యం.ఎ.షరీఫ్ తన కార్యాలయంలో డాక్టర్. రవీంద్రబాబుతో నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం రవీంద్రబాబు శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఉన్నత చదువును పూర్తిచేసి  ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఎంపిగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని అన్నారు. తనకున్న అనుభవం,ప్రజాసేవను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారని గుర్తుచేశారు.

అత్యున్నత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఎం జగన్ తనను ఎంపిక చేసినందుకు తన కుటుంబం తరుపున తన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్సీ చేసినందుకు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  నమ్మకాన్ని నిలబెడుతూ మండలి లోపల,బయట నమ్మకంగా పని చేస్తానని అన్నారు.

సిఎం జగన్ అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు సేవచేసి మంచిపేరు తెచ్చుకుంటానని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మండలి ఛైర్మన్ షరీఫ్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి డిప్యూటి సెక్రటరీ విజయరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments