Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం టీడీపీ ఆఫీసులో పోలీస్ కానిస్టేబుల్ చేతివాటం..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:36 IST)
ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. కార్యాలయంలోని ఇయర్ బడ్స్‌ను ఓ కానిస్టేబుల్ దొంగిలించాడు. దీనికి సంబధించిన వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రెండు రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో వైకాపా శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడితో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ ఆఫీసు ముందు భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేశారు. 
 
ఇదిలావుంటే, దాడి చేసే సమయంలో ఆ కార్యాలయంలోకి వెళ్లిన ఓ కానిస్టేబుల్ తన చేతివాటాన్ని చూపించాడు. ఆఫీసులోకి వెళ్ళిన ఓ కానిస్టేబుల్ విలువైన వస్తువుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. టేబుల్ సొరుగులో ఇయర్ బడ్స్ కనబడటంతో వాటిని పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా వాటిని తన ఫ్యాంటు వెనుక జేబులో వేసుకున్నాడు. ఆపై ఏమీ ఎరుగనట్టుగా బయటకు వచ్చాడు. అయితే, ఆఫీసులో అమర్చిన సీసీటీవీ టీవీల్లో ఆ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. దీన్ని టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments