Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి జైపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (09:25 IST)
సిద్ధాంతపరంగా ముక్కుసూటి మనిషి ఎస్.జైపాల్ రెడ్డి. కానీ, కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా దూరంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన చిన్న సోదరుడు ఎస్.మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. 
 
కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండేవారని.. మా చిన్నాయన పెదనాయన పిల్లలతో సహా అందరితో చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. సమాజంలో నీతి నిజాయితీగా ఎలా ఉండాలనేది ఆయన నుంచే నేర్చుకున్నామన్నారు. 
 
తన నియోజక వర్గం కల్వకుర్తిలో ప్రజలకు ఎంతో సేవ చేశారనీ, అంతేకాకుండా, రాష్ట్రంలోనూ సహాయం ఆర్ధించి వచ్చిన చాలా మందికి ఆయన సహయం అందించారని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 
 
కాగా, కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ వచ్చిన జైపాల్ రెడ్డి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం జులై 28వ తేదీ అర్థరాత్రి కన్నుమూశారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments