క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో బిజెపికి బుద్ది చెప్పాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:24 IST)
విజ‌య‌వాడ‌లోని ఎపిసిసి కార్యాలయంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ జాతీయ పతాకాన్నిఎగుర వేసి, అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించారు.

అనంత‌రం సాకే శైలజానాధ్ మాట్లాడుతూ, ఆనాడు మనుషులు మధ్య విభేధాలు పెట్టి బ్రిటీష్ వాళ్లు దోచుకున్నార‌ని, పేదలకు నీడ లేకుండా తెల్లదొరలు అనేక హింసలు పెట్టార‌న్నారు. మహాత్మాగాంధీ నాడు క్విట్ ఇండియా అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చార‌ని, ఎందరో మహనీయులు త్యాగాలతో తెల్ల దొరలు వెళ్లిపోయార‌ని, ఇపుడు న‌ల్ల‌దొర‌లు మ‌ళ్ళీ దేశాన్ని బానిస‌త్వంలోకి తీసుకెళుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
దేశ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం అని, ఆర్.ఎస్. ఎస్. భావజాలంతో బిజెపి పాలకులు ప్రజల మధ్య కుల, మతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ‌చేసి.. నియంతృత్వ పాలన సాగిస్తున్నార‌ని, అలాంటి బిజేపీకి క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తి తో ప్రజలు తగిన బుద్ది చెప్పాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments