Webdunia - Bharat's app for daily news and videos

Install App

57వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు..మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:00 IST)
రాజధాని రైతుల ఆందోళనలు 57వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి.

మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటల దీక్షలు నిర్వహించనున్నారు.

నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
 
మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి
రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంలో ప్రధాని మోడీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలని, మీరు శంకుస్ధాపన చేసిన అమరావతిని తరలించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని టిడిపి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ అంశాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు. ఇందు కోసం త్వరలో టిడిపి ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments