Webdunia - Bharat's app for daily news and videos

Install App

57వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు..మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:00 IST)
రాజధాని రైతుల ఆందోళనలు 57వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి.

మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటల దీక్షలు నిర్వహించనున్నారు.

నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
 
మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి
రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంలో ప్రధాని మోడీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలని, మీరు శంకుస్ధాపన చేసిన అమరావతిని తరలించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని టిడిపి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ అంశాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు. ఇందు కోసం త్వరలో టిడిపి ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments