Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడకదారి పైకప్పు పనులు త్వరగా పూర్తి చేయండి: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (19:39 IST)
చెప్పులు వేసుకోకుండా మైళ్ళ దూరం నడచుకుని వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే  సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పై కప్పు పనులు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడక దారి పైకప్పు పనులను శనివారం ఆయన పరిశీలించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు పనులు ఏప్రిల్ చివరకు పూర్తి చేస్తామని చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి చైర్మన్ కు వివరించారు.

45వ మలువు నుంచి తిరుమల దాకా  జరుగుతున్న పనులను పరిశీలించిన చైర్మన్ వీటిని కూడా బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని సిఈ చెప్పారు.

బ్రహ్మోత్సవాల నాటికి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పు భక్తులకు అందుబాటులోకి వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఎస్ ఈ 2 నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments