Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకకోసి చంపేస్తారట : కమెడియన్ వేణుమాధవ్ ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (07:07 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన కర్నూలు రెండో పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 
 
నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేసినందుకు తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ పని వైసీపీ వాళ్లే చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పీకకోసి చంపేస్తారమంటూ బెదిరింపులు వచ్చాయని ఆయన పేర్కొనడం గమనార్హం. 
 
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో కొన్ని రోజులుగా పాల్గొంటున్న వేణుమాధవ్.. వైసీపీ తీరుపై, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేయడం తెలిసిందే. 'రోజా' అంటే 'రో' యహాసే 'జా' (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని, టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని... అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని ఇటీవల వ్యాఖ్యానించాడు. 
 
అలాగే, తనకు టీవీ, పేపర్ లేవంటూ తనకు తన తండ్రి వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తిపాస్తులు ప్రజలేనని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేణు మాధవ్ తీవ్రంగానే స్పందించారు. ఆ పేపర్.. ఆ టీవీ చానెల్ ఎవరిది బట్టేబాజ్ అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments