Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - రాత్రికి రాజమండ్రిలోనే బస

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళ, బుధవారాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోనసీమ జిల్లా మీదుగా ప్రారంభమైంది. సీఎం పర్యటనకు సంబంధించి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ పర్యటన కోసం సీఎం జగన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం పెదపూడికి సీఎం చేరుకున్నారు. అక్కడికి సమీపంలోని పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులతో జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత అలిగేవారిపేటకు చెందిన వరద బాధితులను కలుసుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఊడిమూడిలంకలోని వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత అదే మండల పరిధిలోని వాడ్రేవుపల్లికి మధ్యాహ్నం 2.05 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి రాజోలు మండలం మేకలపాలెంకు వెళతారు. ఆ తర్వాత సయంత్రం 4.05 గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రి అతిథి గృహంలో వరదలపై ఉన్నతాధికారులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష తర్వాత సీఎం అక్కడే బస చేసి, బుధవారం మరికొన్ని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments