Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 12వ తేదీన విద్యాకానుక పంపిణీ : మంత్రి బొత్స

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (17:51 IST)
వేసవి సెలవులు తర్వాత ఏపీలో ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభంకానున్నాయి. అదేరోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుకకు సంబంధించిన విద్యా కిట్లను ప్రదానం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.2500 విలువైన విద్యా కానుక కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని క్రోసూరలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లను ప్రదానం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 లక్షల మంది ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలను సీఎం అందజేస్తారన్నారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగుతుందన్నారు. 
 
టెన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా అదే తరగతిలో రెగ్యులర్‌గా చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments