Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణం నుంచే పాలన సాగిస్తాం : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోమారు పాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్టణం నుంచి రాష్ట్ర పాలన సాగుతుందని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. విశాఖ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే విశాఖ నుంచి పరిపాలనను సాగిస్తామని తెలిపారు. 
 
ఎగుమతుల పరంగా, ఉపాధి అవాకాశాలపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఏపీలోని పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏపీలో రాష్ట్రంలో 340 కంపెనీలు, 20 రంగాల్లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.
 
ఈ సదస్సు ప్రారంభమైన మొదటి రోజే ఏకంగా 92 కంపెనీలో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. విశాఖ నగరం పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు విశాఖ చిరునామాగా ఉందన్నారు. సుదీర్ఘమైన తీరప్రాంతం కలిగిన విశాఖ నుంచే త్వరలో పరిపాలనను కొనసాగిస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments