Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. విశాఖకు సీఎం జగన్.. కేటీఆర్ ట్వీట్..

Advertiesment
ktr_jagan
, గురువారం, 2 మార్చి 2023 (15:11 IST)
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖపట్నం సిద్దమైంది. ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు.  
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాత్రి విశాఖ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటూ అక్కడే ఉంటారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  
 
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో తొలి రోజు మార్చి 3న శుక్రవారం ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షత జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.
 
ఇదిలా వుంటే.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 
 
ఇంకా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ఆశించారు. ఈ సదస్సుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్‌కు ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్.. ఏడుగురు చిన్నారుల మృతి