Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ వైర్లు తెగిన ఘటనపై ఏడీఈ, ఏఈ‌, లైన్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:31 IST)
అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు తెగి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి ఏడీఈ, ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేసింది. అలాగే, ఘటనకు సంబందించిన సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్‌ను ఆదేశించింది. 
 
కాగా జిల్లాలోని బొమ్మనహాల్ మండలం, దర్గాహోన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
ఈ వ్యవసాయ కూలీలు పంట కోస్తుండగా వర్షం కురవడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ట్రాక్టర్‌లో ఎక్కారు. ఆ సమయంలో 33 కేవీ విద్యుత్ మెయిన్‌ లైన్ తీగలు తెగి వారిపై పడటంతో ఆరుగురు కూలీలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments