Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానితో భేటీకాకుండానే భాగ్యనగరికి చేరుకున్న సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:13 IST)
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీకాకుండానే ఆయన తిరిగివచ్చారు. 
 
రాష్ట్రం నుంచి వరిధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీని కోరడానికి కొందరు మంత్రులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై చర్చించి, వినతి పత్రాలు సమర్పించేలా తెరాస నేతలకు దిశానిర్దేశం చేశారు. 
 
అయితే, ఏ ఒక్క మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలోనే మకాం వేశారు. కానీ, ప్రధాని ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు సమయం కేటాయించలేక పోయారు. దీంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments