Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానితో భేటీకాకుండానే భాగ్యనగరికి చేరుకున్న సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:13 IST)
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీకాకుండానే ఆయన తిరిగివచ్చారు. 
 
రాష్ట్రం నుంచి వరిధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీని కోరడానికి కొందరు మంత్రులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై చర్చించి, వినతి పత్రాలు సమర్పించేలా తెరాస నేతలకు దిశానిర్దేశం చేశారు. 
 
అయితే, ఏ ఒక్క మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలోనే మకాం వేశారు. కానీ, ప్రధాని ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు సమయం కేటాయించలేక పోయారు. దీంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments