Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బృందంతో నేడు భేటీ కానున్న సీఎం జగన్, వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:53 IST)
ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజులపాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈ రోజు ఉదయం 11 గంటల30 నిమిషాలకు సీఎంను కలవనున్నారు. వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎస్ 6వేల 386 కోట్లు నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
 
తాత్కాలిక సహాయక చర్యల కోసం 840 కోట్లు అవసరం కాగా శాస్వత పునరుద్దరణ చర్యకు 4 వేల 439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా 903 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.
 
అలాగే 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని దీనికోసం 483 కోట్లు నష్టం ఏర్పడిందని తెలిపారు. తక్షణ సాయం, తడి ధాన్యం కొనుగోలుపై సడలింపు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు. అయితే వరద కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ఆదుకోవాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments