Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనిఫెస్టో మొత్తం చేస్తున్నా; జ‌గ‌న్; ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు; చంద్ర‌బాబు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (18:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అపుడే సాధారణ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిందంతా చేసేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెపుతున్నారు. వాటికి మూడు రెట్లు ప్ర‌జ‌ల‌పై భారం వేస్తున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు.
 
 
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ‘‘అధికారంలోకి రాగానే పింఛన్‌ ₹2,250కి పెంచాం. రెండున్నరేళ్లలో ఇవాళ ₹2,500కు పింఛన్‌ పెంచుతున్నాం. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందిస్తారు. ఎవరైనా.. మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. విమర్శించేవాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించట్లేదా? పింఛన్‌ ₹3వేలకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం’’ అని జగన్‌ తెలిపారు.
 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారని.. వారి భ్రమలు తొలగిపోయాయన్నారు. సంక్షేమం కింద ఇచ్చేదాని కంటే ప్రజలపై మోపే భారం 3 రెట్లు ఎక్కువని ఆరోపించారు. ఆదాయం, ఖర్చును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. వివిధ సంస్థల విశ్వసనీయత, బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments