Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ సిబిఐ కేసు వాద‌న‌ల‌కు సిద్ధం!

Webdunia
గురువారం, 29 జులై 2021 (20:05 IST)
అక్రమాస్తులపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో వాదనలకు సిద్ధం కావాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు సహ నిందితుల తరపు న్యాయవాదులకు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన మనీల్యాండరింగ్‌ కేసుల విచారణ ఆగస్టు 6కి వాయిదా పడింది. 
 
సీబీఐ కేసులతో నిమిత్తం లేకుండా ఈడీ కేసులు ప్రత్యేకంగా విచారిస్తామన్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు జగతి పబ్లికేషన్స్‌ తరపున మెమో దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు జడ్జి బి.ఆర్‌.మధుసూదనరావు విచారణను వాయిదా వేశారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్ పై కేసుల విచారణ ఆగస్టు 6కి వాయిదా పడింది. 
 
సీబిఐ సీఎం జ‌గ‌న్ ఆస్తుల కేసును నానుస్తోంద‌నే విమ‌ర్శ‌లు ప్ర‌తిపక్షాల నుంచి వ‌స్తున్నాయి. త‌ర‌చూ వాయిదాలు ప‌డుతూ, సిబిఐ ఈ కేసు విచార‌ణ‌కు ముందుకు సాగ‌డం లేద‌నే వాద‌న‌లు వినిస్తున్నాయి. అయితే, ఇపుడు ఆ కేసు వాద‌న‌లు మొద‌లు కాబోతున్నాయ‌ని న్యాయ‌వాద వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆగ‌స్టు నుంచి వాద‌న‌లు ప్రారంభం అయితే, కేసు త్వ‌రిత‌గ‌తిన ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments