Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ ఎన్నికల్లో పోటీ చేశారు... రాజకీయ లబ్ది కోసమే పిటిషన్ : కేంద్రం

విశాఖ ఎన్నికల్లో పోటీ చేశారు... రాజకీయ లబ్ది కోసమే పిటిషన్ : కేంద్రం
, బుధవారం, 28 జులై 2021 (13:20 IST)
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకంగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన న్యాయవాది విచిత్ర వాదనలు వినిపించారు. వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొన్నారు. అందువల్ల లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణ అర్హత లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. 
 
దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం.. ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటెన్ష‌న్లో పోలీసులు, గుండెపోటుతో సీఐ శ్రీధ‌ర్ రెడ్డి మృతి