Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిదండి చినజీయర్‌ స్వామికి సీఎం జ‌గ‌న్ పాదాభివంద‌నం!

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (10:36 IST)
ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామికి పాదాభివంద‌నం చేసి ఆయ‌న ఆశీస్సులు పొందారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా ఆయ‌న రాక‌కు భ‌క్తి తో ప్ర‌ణ‌మిల్లి, ఆయ‌న‌కు సీఎం జ‌గన్ ఒంగి పాదాలను తాకారు. 
 
 
రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ ఆయ‌న ఆహ్వానాన్ని అందుకుని, సానుకూలంగా స్పందించారు.

 
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామ‌ని, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేక, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలుంటాయ‌ని తెలిపారు. చినజీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments