Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడి ఛైర్మన్ పదవి నుంచి వైవీ సుబ్బారెడ్డికి ఉద్వాసన?

Webdunia
బుధవారం, 19 జులై 2023 (09:29 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు పాలక మండలి ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మొదటి విడత పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి కూడా ఆయనే కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని పార్టీ పదవుల్లోనూ మార్పు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి సీనియర్ నేత విజయసాయిని గతేడాది తొలగించారు. 
 
అలాగే, ప్రాంతీయ సమన్వయకర్త పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడా స్థానాన్ని విజయసాయిరెడ్డికి కానీ, లేదంటే మరో నాయకుడికి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, మరికొన్ని స్థానాల్లోనూ కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments