టీటీడి ఛైర్మన్ పదవి నుంచి వైవీ సుబ్బారెడ్డికి ఉద్వాసన?

Webdunia
బుధవారం, 19 జులై 2023 (09:29 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు పాలక మండలి ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన మొదటి విడత పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి కూడా ఆయనే కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. టీటీడీ బోర్డు నియమాకంపై సమీక్ష అనంతరం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని పార్టీ పదవుల్లోనూ మార్పు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి సీనియర్ నేత విజయసాయిని గతేడాది తొలగించారు. 
 
అలాగే, ప్రాంతీయ సమన్వయకర్త పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడా స్థానాన్ని విజయసాయిరెడ్డికి కానీ, లేదంటే మరో నాయకుడికి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, మరికొన్ని స్థానాల్లోనూ కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments