లండన్ మీదుగా దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్?

Webdunia
శనివారం, 21 మే 2022 (11:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ మీదుగా దావోస్ చేరుకున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి శుక్రవారం ఉదయం తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి ప్రత్యేక లగ్జరీ విమానంలో బయలుదేరిన ఆయన ముందుగా లండన్‌కు వెళ్లి అక్కడ నంచి దావోస్‌కు చేరుకున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ప్రయాణించిన విమానం చేరుకుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. 
 
ఈ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. కాగా, శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎం దంపతులకు వీడ్కోలు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments