Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కార్యాలయ ఉద్యోగి పెళ్లికి వచ్చిన వైఎస్. జగన్ దంపతులు..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (15:22 IST)
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ అనే ఉద్యోగి వివాహానికి సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం దంపతుల రాకతో పెళ్లి మంటపంలో సందడి మరింత అధికమైంది.
 
నిజానికి ముఖ్యమంత్రి అంటే రోజుకుమ 24 గంటలు సరిపోని పదవి. రాష్ట్ర వ్యవ‌హారాల‌తోపాటు అధికారుల స‌మ‌న్వ‌యం.. ఇలా ప్ర‌తి నిముషం బిజీ, బిజీగా గడుపుతుంటారు. అయితే ఇంత‌టి బిజీ టైమ్‌లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చుట్టూ ఉన్నవాళ్ల మంచి, చెడులను తెలుసుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.
 
దీనికి నిదర్శనమే గురువారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్‌ వివాహానికి సతీ సమేతంగా హాజరుకావడం. ఈ వివాహా వేడుకకి సీఎం దంపతులతో పాటు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల రవి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments