మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:03 IST)
మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య శుక్రవారం తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలాశౌరిని పేర్ని నాని అనుచరులు అడుకుని "గోబ్యాక్‌ ఎంపీ" అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై ఘాటుగానే స్పందించిన ఎంపీ "బందరు నీ అడ్డానా..!" అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
 
తమకు సంబంధించిన శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఎంపీ బాలాశౌరిని శుక్రవారం కోరారు. దీంతో ఆయన అక్కడకు వెళ్తుండగా.. పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు. ప్రజా సమస్యను పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments