Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టహాసంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:18 IST)
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్‌ బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పర్వదినం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. 
 
క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రార్థనల కోసం మందిరం ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటగిరి లంకలో ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్‌ స్టార్‌ ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు ఏసుక్రీస్తును ప్రార్థించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. 
 
నెల్లూరు జిల్లా సుబేదారిపేటలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మందిరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో క్రిస్మస్‌ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments