Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వు లేక నేను లేను' : ఆమెను వదిలివుండలేక యువకుడు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉండలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి విషం సేవించినప్పటికీ.. ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ప్రియురాలు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్‌ కుమార్‌(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో భార్యను గట్టిగా మందలించాడు. అయినప్పటకీ.. వారిద్దరి మధ్య బంధం కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో మరోమారు భార్యను భర్త హెచ్చరించాడు. ఈ క్రమంలో ఒకరివదిలి మరొకరు ఉండలేని వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం గ్రామం నుంచి కనిపించకుండా పోయారు. మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయారు. 
 
సాయంత్రం ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. దిలీప్‌ అప్పటికే చనిపోయాడు. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments