Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుంది : ఎంపీ శివప్రసాద్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహ

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:09 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు రెచ్చిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా శివప్రసాద్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు సహనానికీ ఓ హద్దు ఉంటుందని, ఆయన అలిగితే పరిస్థితులు విషమిస్తాయన్నారు. "అంత దూరం తీసుకురావద్దు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు" అని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని, అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే తాము నిరసనలకు దిగినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments