Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (13:03 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వర రావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి పలు ప్రాంతాలలో బ్లేడ్ చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణించేవారిపై దాడులకు పాల్పడి దోచుకునేవారు. ఈ క్రమంలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments