Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైశ్యుల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైనది: మంత్రి పేర్ని నాని

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:29 IST)
దేవుడి ఆస్తులు కైంకర్యంకు గురి కాకుండా మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే  ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి  జగన్‌ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను క్రయ విక్రయాలు జరపడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించిన నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు.     
 
సోమవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మంత్రి పేర్ని నానిను ,ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్  వి.సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో ఇటీవల తీర్మానం చేసినందుకు వారు కృతజ్ఞతలు మంత్రికి మచిలీపట్నంకు చెందినపలువురు ఆర్య వైశ్య ప్రముఖులు తెలిపారు. 

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి వెనుక ఉన్న పల్లపోతు సుబ్బారావు ధర్మ సత్రం, చిట్టూరి వీరయ్య ధర్మ సత్రం, తాడేపల్లి వారి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని  పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్టుగా వెల్లడైతే తక్షణం ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేస్తుందని షరతు విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments